వధువు పరార్...!

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ లోని చిత్త్తూర్ జిల్లా మదనపల్లి మండలం, తట్టివారి పల్లికి చెందిన రామకృష్ణ మల్లికల కుమార్తె సోనికకు పెద్దలు ఆదివారం వివాహము జరిగేలా నిశ్చయించారు. నవీన్ కుమార్‌తో సోనికకు స్థానిక సంఘం ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది, పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు కావడంతో లక్షల రూపాయలను వెచ్చించి పెళ్లి ఏర్పాట్లు ధూమ్ ధామ్‌గా నిర్వహించారు. ఈ తరుణంలో తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేస్తున్నారనే నెపంతో పెళ్లి కుమార్తె సోనిక కళ్యాణ మండపం నుండి ఆదివారం తెల్లవారుజామున పారిపోయింది. పెళ్లి కుమార్తె ఇలా పీటల మీద నుంచి లేచి పోవడంతో ఖంగుతిన్న పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు అవమానంతో చేసేదేమీలేక పెద్ద మనుషులతో కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ప్రియునితో లేచిపోయిన సోనిక తను ప్రేమించిన చరణ్ తో వివాహము చేసుకుని జంటగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)