డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ పేమెంట్ సంస్థ గూగుల్ పే మరో కొత్త ఫీచర్ను ప్రకటించింది.' గూగుల్ ఫర్ ఇండియా 2021' విజన్లో భాగంగా ఈరోజు దీన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం యూపీఐ నంబర్ ఎంటర్ చేసి సెండ్ కొడితే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమైపోతున్నాయి. అయితే ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్గా వాయిస్ బేస్డ్ మనీ ట్రాన్స్ఫర్ ఆప్షన్పై గూగుల్ పే పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ కమాండ్ ఇస్తే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమవుతాయి. ఈ వాయిస్ కమాండ్ ఇంగ్లిష్, హిందీ రెండు భాషలకు మద్దతిస్తుంది. అందుకే దీనికి 'హింగ్లీష్' అనే పేరు పెట్టింది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఆ తర్వాతి కాలంలో ఈ రెండు భాషలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు వంటి భాషల్లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాయిస్ ఇన్పుట్తో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు "స్పీచ్ టు టెక్స్ట్" అనే ఫీచర్ను గూగుల్ జోడించనుంది. ఈ ఫీచర్ ద్వారా యాప్ను మరింత స్మార్ట్గా మార్చాలని కంపెనీ భావిస్తోంది. త్వరలోనే ఈ స్పీచ్ టూ టెక్స్ట్ ఫీచర్ను గూగుల్ యూజర్లందరికీ పరిచయం చేయనుంది. వాయిస్ ఇన్పుట్ ద్వారా మనకు కావాల్సిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ పే కల్పిస్తోంది. అకౌంట్ నంబర్ను హిందీ లేదా ఇంగ్లీష్లో చెప్పవచ్చు. అనంతరం సెండర్ కన్ఫర్మేషన్తో పేమెంట్ పూర్తవుతుంది. మరోవైపు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గూగుల్ పే 'మై షాప్' ఫీచర్ని కూడా జోడిస్తుంది. గూగుల్పే యాప్లో వారి వ్యాపారాలకు సంబంధించిన ఫోటోలు, వివరణలు, ధరలను నిమిషాల్లో జోడించి.. ఆ లింక్ను బిజినెస్ ప్రొఫైల్ ద్వారా సోషల్ మీడియాల్లో షేర్ చేయవచ్చు. దీని ద్వారా చిరు వ్యాపారుల బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుందని గూగుల్ పేర్కొంది. మని కొన్ని రోజుల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్ పేని ఉపయోగిస్తున్నారు. గూగుల్ పేలో వ్యాపారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో కొత్తగా లాంచ్ అవుతోన్న మై షాప్ ఫీచర్ చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం గూగుల్ 10 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.
వాయిస్తో మనీ ట్రాన్స్ఫర్ !
November 19, 2021
0