భారీ వర్షాలకు 11 మంది మృతి, 30మంది గల్లంతు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలో ఇప్పటి వరకు 30 మంది వరకు గల్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపత్తూరులో వాగు మధ్యలో ఉన్న శివాలయానికి దర్శనానికి వెళ్లిన 11 మంది భక్తులు చనిపోయారు. చెంగల్‌రెడ్డి, వెంకటరాజు, మల్లయ్య, వెంకట సుబ్బరాజు, చెన్నకేశవులు, గంగయ్య, శంకరమ్మ, ఆదెమ్మ, పద్మావతమ్మ, భారతి, మహాలక్ష్మిగా మృతులను గుర్తించారు. సిద్దవటం మండలం వెలుగుపల్లెల గ్రామంలో వరద ఉధృతికి ఐదుగురు గల్లంతయ్యారు. చెయ్యేరు వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకోగా ఒక పల్లె వెలుగు బస్సు పూర్తిగా నీట మునిగింది. ఈ బస్సులో కండక్టర్‌ అహోబిలంతో సహా మరో నల్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో రెండు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. మరో ముగ్గురు ప్రయాణికులు చెట్టు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మరో ఆరుగురు ప్రయాణికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)