మాములుగా మంచి టీ పౌడర్ కిలో ₹600 నుంచి ₹1,000 వరకూ ఉంటుంది. మన దేశంలోనే డార్జిలింగ్లో పండించే ఒక రకం టీ పొడి ధర కిలో ₹1.3 లక్షలు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... ప్రపంచవ్యాప్తంగా ఇలా ఖరీదైన టీ పొడులు మరికొన్ని ఉన్నాయి. వీటిలో డా హాంగ్ పావొ అనే టీ పొడి అత్యధికంగా కిలో ₹10కోట్లు పలుకుతుంది. పూర్వం స్థానిక చక్రవర్తి అనారోగ్యంతో బాధపడుతుంటే ఓ సన్యాసి ఈ తేయాకులతో టీ చేసి తాగించాడట. వెంటనే ఆయన కోలుకున్నాడట. అప్పట్నుంచీ దీన్ని సంజీవనిలా భావిస్తారు. అందుకే, టీపొడి ఖరీదు చాలా ఎక్కువ.
టీ పొడి కిలో ₹10కోట్లు !
November 24, 2021
0