కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

Telugu Lo Computer
0



కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 28 శాతం నుంచి 31 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. డీఏ పెంపు వల్ల 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇది జూలై 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెన్షనర్లకు కూడా డీఏను పెంచామని, వారికి కూడా ఈ లబ్ధి చేకూరుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)