చేపల వలకు చిక్కిన కొండచిలువ
October 06, 2021
0
వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ సమీపంలోని చెరువులో చేపల కోసం వల వేశారు. కానీ ఈ వలలో చేపలకు బదులు కొండచిలువ చిక్కింది. మత్స్యకారులు వలలో ఉన్న కొండచిలువను చూసి షాక్ అయ్యారు. అనంతరం ప్రసాద్ అనే యువకుడు.. వనపర్తి స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్కు సమాచారం అందించాడు. కృష్ణ సాగర్ బృందం అక్కడికి చేరుకొని వలలో చిక్కిన కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు. ఈ కొండచిలువను నల్లమల అడవుల్లో వదిలేస్తామని కృష్ణ సాగర్ బృందం తెలిపింది.