నిన్న అమితాబ్‌ - నేడు రణ్‌వీర్‌

Telugu Lo Computer
0


భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ఆదరణను మరింత క్యాష్‌ చేసుకునేందుకు పలు కంపెనీలు సిద్దమైయ్యాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ను కాయిన్‌ డీసీఎక్స్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం కంపెనీ కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ రణ్‌వీర్‌సింగ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కొద్ది రోజుల క్రితమే కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ యూనికార్న్‌ క్లబ్‌లో జాయిన్‌ అయ్యింది. కంపెనీ వాల్యూయేషన్‌ సుమారు 1.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీ విషయంలో కాయిన్‌ స్విచ్‌ రణ్‌వీర్‌సింగ్‌తో మూడు యాడ్స్‌ను రూపోందించనున్నట్లు తెలుస్తోంది. కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ 'కుచ్‌ తో బద్‌లేగా..' క్యాంపెయిన్‌తో టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేలా ప్రోత‍్సహించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)