పాకిస్తాన్ లో ఏడుగురు సజీవ దహనం

Telugu Lo Computer
0

 

తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందంటూ ఓ వ్యక్తి కుటుంబంలోని ఏడుగురిని సజీవ దహనం చేశాడు. అందులో అతని ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌గఢ్‌కు చెందిన మంజూర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, ఆమె నెలల చిన్నారి, భర్త, మరో నలుగురు పిల్లలు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఇందులో నుంచి బయటపడిన హుస్సేన్‌ మరో అల్లుడు మెహబూబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజూర్ హుస్సేన్‌తోపాటు అతని కొడుకు సాబిర్ హుస్సేనే ఈ దారుణానికి పాల్పడ్డారని, తాను ఇంటికి వచ్చే సమయానికి ఆ ఇద్దరూ పారిపోవడం చూశానని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)