డ్రగ్స్ గురించి ఆర్యన్ తో జోక్ చేశా... !

Telugu Lo Computer
0


డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్ నటి అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ జరిపిన వాట్సాప్‌ చర్చల్లో అనన్య పేరు రావడంతో గురువారం అధికారులు ఆమె నివాసానికి వెళ్లి సమన్లు జారీ చేశారు. దాంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఎన్‌సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆమెను అధికారులు ప్రశ్నించారు. ఆర్యన్‌ ఖాన్‌తో, అనన్యపాండేల మధ్య గంజాయి కోసం వాట్సాప్‌ చర్చ జరిగిందని ఎన్‌సీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. గంజాయి కోసం చాట్ లో ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పిందని తెలిసింది. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్‌తో అసలు సంబంధం లేదని, ఆర్యన్‌తో కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్టు సమాచారం. తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తమ మధ్య జరిగిన సంభాషణ సిగరెట్స్ గురించని, డ్రగ్స్ గురించి కాదని ఆమె చెప్పిందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)