ప్రాణం కాపాడిన పోలీసులు
October 20, 2021
0
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో నివసించే ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవ పడ్డాడు. వాగ్వాదం అనంతరం ఆ భార్య పొలానికి వెళ్లిపోయింది. భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన భర్త క్షణికావేశంలో అత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాధతో మద్యం తాగి ఇంట్లోకి వెళ్లి కోపంతో తలుపువేసుకున్నాడు. ఇదంతా గమనించిన అతని కుమార్తె వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడు తన చెల్లికి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. సోదురుడు సూచించిన మేరకు ఆ బాలిక పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు కేవలం మూడు నిమిషాల్లోనే మూడు కిలోమీటర్లు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించడంతో పాటు స్థానికి ప్రజలు గుమికూడి అతను చనిపోయినట్లు భావించారు. అయితే అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉందని పోలీసులో ఒకరు గమనించి వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతని ప్రాణాలను కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.