ఊపందుకున్న గృహ విక్రయాలు

Telugu Lo Computer
0


దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 59శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 55,907 యూనిట్స్‌ను విక్రయించినట్లు ప్రాప్‌ టైగర్‌.కామ్‌ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. గత త్రైమాసికంతో పోల్చుకొంటే డిమాండ్‌ మూడు రెట్లు పెరిగింది. ఈ త్రైమాసికంలో కేవలం 15,968 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో విక్రయాలు బాగా తగ్గాయి. గతేడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో విక్రయాలు 35,132 యూనిట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టగానే విక్రయాలు ఊపందుకొన్నట్లు ఈ సంస్థ నివేదిక రియల్‌ ఇన్‌సైట్‌లో పేర్కొంది. చాలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఈ సీజన్‌లో విక్రయాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇక ఈ పండుగల సీజన్‌లో భారీగా అమ్మకాలు ఉండొచ్చని అంచనావేసింది. హైదరాబాద్‌లో గత త్రైమాసికంలోని 3,260 యూనిట్లతో పోల్చుకొంటే ఈ సారి రెట్టింపై 7,812కు విక్రయాలు చేరాయి. ఈ త్రైమాసికంలో బెంగళూరులో 6,557, చెన్నైలో 4,665, దిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌లో 4,458, కోల్‌కతాలో 2,651,ముంబయిలో అత్యధికంగా 92శాతం పెరిగి 14,163కు చేరాయి. పుణేలో 10,128 యూనిట్లు అమ్ముడు పోయాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)