అత్యాశకు పోయిన బంగారం వ్యాపారి!

Telugu Lo Computer
0

 


కర్ణాటకకు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ ఏడాది జూన్ లో ఫోన్ ద్వారా గద్వాలకు చెందిన శ్రీనివాస్ అనే బంగారం వ్యాపారిని సంప్రదించాడు. మొదట తేలిగ్గా తీసుకున్న శ్రీవాసులు పదే పదే ఫోన్ చేయడంతో చివరికి తన మిత్రుడైన మెకానిక్ గోవర్ధన్ తో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతంలోని హౌస్ ఫ్రంట్ కు వెళ్ళాడు అక్కడి వ్యక్తి పొలం లో దొరికిన బంగారు చైన్‌లు కొన్ని చూపించాడు.. వెంటనే వాటిని గద్వాలకు తీసుకొచ్చి నిజమైన బంగారం నిర్ధారించుకున్నారు.  తాను అరకిలో బంగారం ఇస్తానని అందుకు కోసం రూ 15 లక్షలు తీసుకురావాలని దాన్ని విక్రయించిన తర్వాత బంగారం ఇస్తానని నమ్మబలికాడు. శ్రీనివాస్‌ను దావనగిరి కి రమ్మని చెప్పడంతో నమ్మిన శ్రీనివాసులు తన మిత్రుడు గోవర్ధన్ తో కలిసి మరోసారి వెళ్లారు. అప్పటికే పక్క ప్లాన్ తో తన మిత్రులతో ఉన్న కర్ణాటక వాసి రూ 15 లక్షలు గుంజుకుని ఇద్దరి పై దాడికి పాల్పడ్డాడు. అనంతరం గద్వాలకు వచ్చిన వ్యాపారి శ్రీనివాస్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)