చైనాలో భారీ పేలుడు

Telugu Lo Computer
0


చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్ ప్రాంతంలో గురువారం ఉదయం 8.20 గంటల సమయంలో ఓ రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభవించింది. మూడు అంతస్తులు గల రెస్టారెంట్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారు డాష్ బోర్డులో కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యింది. భారీగా మంటలు చెలరేగడంతో పాటు పెద్ద ఎత్తున దుమ్ము దూళీ ఎగిసిపడ్డాయి. ఎం జరిగిందో తెలియక ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడం ఆ వీడియోలో కనిపించింది. సమీపంలో పార్క్ చేసిన ఉన్న వాహనాలపై రెస్టాంట్ శిధిలాలు పడడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)