'దిశ' నిందితుల ఎన్కౌంటర్
October 01, 2021
0
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్ను కమిషన్ ప్రశ్నించింది. పోస్టుమార్టంకు సంబంధించి దిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుధీర్ను ప్రశ్నించింది. బుల్లెట్ గాయాల వల్ల నలుగురు నిందితులు చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని సుధీర్ కమిషన్కు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నియమావళిని పాటించారా? లేదా? అని వైద్యుడిని అడిగింది. పోస్టుమార్టం నివేదికలోని పలు అంశాలపై కమిషన్ సభ్యులు ప్రస్తావించారు.