ఢిల్లీలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మళ్లీ పెరిగాయ్ !

Telugu Lo Computer
0


ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో సీఎన్‌జి, పీఎన్‌జి రేట్లు మళ్లీ పెరిగాయి.ధరల పెంపుతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఢిల్లీ,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో సీఎన్‌జి, పీఎన్‌జి ధరలను సవరించింది.ఢిల్లీలో సీఎన్‌జి ధర ఇప్పుడు కిలో రూ. 49.76 గా ఉంది. పీఎన్‌జి ధర కిలో రూ. 35.11 కి లభిస్తుందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.నోయిడా, గ్రేటర్ నోయిడా,ఘజియాబాద్‌లో సీఎన్‌జి ధర కిలోకు రూ. 56.02 కాగా, పీఎన్‌జి ధర రూ .34.86 కు లభిస్తోంది. గురుగ్రామ్‌లో సీఎన్‌జి ధర కిలోకు రూ. 58.20,పీఎన్‌జి ప్రతి కిలోకు రూ .33.31 కి లభిస్తుంది.గత 10 రోజుల్లో సీఎన్‌జి ధరలు పెరిగాయి.సీఎన్‌జి, పీఎన్‌జి రేట్లు వరుసగా కిలోకు రూ .2.28, రూ.2.110 పెరిగాయి.ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి, ఎరువుల తయారీకి ఉపయోగించే గృహవాయువు ధరను 62 శాతం పెంచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)