తెలంగాణ లోని మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలోని సబ్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ (28) అనే యువకుడు సబ్ స్టేషన్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉద్యోగంలో తీవ్ర పని ఒత్తిడి, ఆపరేటర్ల పెర్మినెంట్ విషయంలో ప్రభుత్వ తాత్సర వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన తాతకు వాట్సప్ సందేశం పంపి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.