తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ చింతల్మెట్లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి తల్లి యాదమ్మను కూతురు నందిని చంపేసింది. తమ ప్రేమకు అడ్డు వస్తోందని తల్లిపై ఆగ్రహం చెంది ఈ దారుణ ఘటనకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కూతరు నందిని, ప్రియుడు చోటూ అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కన్నతల్లిని చంపిన కూతురు
October 18, 2021
0