తెలంగాణలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు

Telugu Lo Computer
0



తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం, పెద్దపల్లి, రామగుండంలలో భూమి కంపించింది. 2 సెకండ్లపాటు కంపించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నస్పూర్‌ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీ, శ్రీరాంపూర్‌తోపాటు జైపూర్‌ మండలంలోని ఇందారం గ్రామంలో భూమి కంపించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)