వరుస నష్టాలకు బ్రేక్
October 25, 2021
0
దేశీ సూచీల్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ సెన్సెక్స్ , నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. 145.43 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 60,967.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.50 పాయింట్లు ఎగబాకి 18,125.40 వద్ద స్థిరపడింది. చైనాలో మళ్లీ కేసులు వెలుగులోకి వస్తుండడం, గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ, చమురు ధరల పెరుగుదల వంటి కారణాలు సూచీలను ఇంట్రాడేలో కలవరపెట్టాయి.