శోభానాయుడు

Telugu Lo Computer
0


శోభానాయుడు వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.12 యేళ్ళ వయస్సులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు.చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ  పిల్లలకు శిక్షణ నిస్తున్నారు.శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆమె అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2020 అక్టోబర్ 13 అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారు.కొంతకాలంగా న్యూరోలాజికల్ సమస్యతో చికిత్స పొందుతున్నారు.

అవార్డులు 

2001 - పద్మశ్రీ పురస్కారం పురస్కారం

1982 - మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి

1998- ఎన్టీయార్ పురస్కారం

1990 - సంగీత నాటక అకాడమీ పురస్కారం

2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు


Post a Comment

0Comments

Post a Comment (0)