అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కుప్పం- కృష్ణగిరి హైవేలో రామనాథరెడ్డిని అరెస్టు చేశారు. ఎర్రచందనం తరలిస్తుండగా చిత్తూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తెల్లవారుజాము 3గంటలకు రామనాథరెడ్డిని పట్టుకొని రూ.50లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు ముగ్గురు అనుచరులను అరెస్టు చేసినట్లు ఎస్ఈసీ ఏఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.