హైదరాబాద్ మహా నగరం లో మరోసారి డ్రగ్స్ భారీగా స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోల డ్రగ్స్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా కు చేసిన పార్సిల్ లో మూడు కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కొరియర్ కార్యాలయంలో ఎన్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెన్నై కు చెందిన వ్యక్తి పార్శిల్ చేసినట్లు గుర్తించి కొరియర్ కార్యాలయం లో సమర్పించిన గుర్తింపు కార్డుల ఆధారంగా చెన్నై వెళ్లిన అధికారులకు సదరు చిరునామాలో నిందితుడు దొరకలేదు. రెండు రోజుల పాటు చెన్నై లో వెతికి నిందితుడిని అరెస్ట్ చేశారు. విశాఖ పట్నం లో ఒక్కరినీ హైదరాబాద్ లో ముగ్గురు బిహారీ లను అదుపు లోకి తీసుకున్నారు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
October 23, 2021
0