తెలంగాణ లోని మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రిని అతని కుమారుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దశంకరంపేట మండలం కోలపల్లిలో డబ్బు విషయంలో తండ్రితో కుమారుడు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న కుమారుడు తన తండ్రిని కొట్టి చంపాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Post a Comment
0Comments
3/related/default