జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో జిల్లాలో ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వాన్పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ముగ్గురికి తూట గాయాలు కాగా.. ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు రాజా రేషి దేవ్, జోగిందర్ రేషి దేవ్గా గుర్తించారు. వీరి స్వస్థలం బిహార్. గాయపడ్డ మరో వ్యక్తిని చున్ చున్ రేషి దేవ్గా గుర్తించారు. సదరు వ్యక్తిని దవాఖానకు తరలించి, వైద్యం అందిస్తున్నారు. అయితే, కాల్పులకు తెగబడ్డ జాడ తెలియరాలేదు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వారి జాడ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు రోజుల్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగడం ఇది మూడోసారి.