పోలీసులపై పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం

Telugu Lo Computer
0



ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులపై జన సేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పైకి ఎక్కి మరీ పోలీసుల తీరు పై నిప్పులు చెరిగారు పవన్‌ కళ్యాణ్‌. తమ జన సేన పార్టీ కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు పవన్‌ కళ్యాణ్‌. తమ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే…. ఊరుకోబోనని కారు పైకి నుంచి వార్నింగ్‌ ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక అటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. గంట క్రితమే ఉత్కంఠ పరిస్థితుల్లో రాజమండ్రి కి చేరుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారీ సంఖ్య లో జనం రాజమండ్రి ఎయిర్‌ పోర్టు చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్‌ కళ్యాణ్‌ శ్రమ దానం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం హుకుంపేట బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)