హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసీలో మొసలి కలకలం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. గండిపేట, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీలో వరద భారీగా ప్రవహిస్తోంది. ఈ వరదలో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో కిస్మత్పురాలో రెండు మొసలి కళేబరాలు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. జూ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు.