రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షం

Telugu Lo Computer
0


తెలంగాణా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు గాలుల ప్రభావం వలన నవంబర్ నెల 03, 04 తేదీలలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల వచ్చే అవకాశాలున్నాయి. నిన్న తమిళనాడు తీరం, శ్రీలంక తీరప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడనం ఈరోజు కూడా స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో పశ్చిమం వైపు ప్రయాణించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)