ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఒపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ ఆ పార్టీ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన రాజీనామా లేఖ పంపించారు. అందులో. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని అత్యంత విచారం, బాధతో తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నానని, అయితే కాంగ్రెస్లో ఉత్తేజం కొరవడిందని అన్నారు.వారి నాయకత్వంలో పార్టీని సమర్థవంతంగా నిర్వహించారు కానీ.. కొందరి నేతల మొండి వైఖరి కారణంగా కాంగ్రెస్ నానాటికీ క్షీణిస్తోందని అన్నారు. ప్రస్తుతం పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని, తిరిగి నమ్మకాన్ని సాధించాలంటే చాలా కాలం పడుతుందని పేర్కొన్నారు. కాగా, మాఝీ త్వరలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడిలో చేరబోతున్నట్లు సమాచారం.