బాలుడిపై జడ్జి అత్యాచారం!

Telugu Lo Computer
0

 

పద్నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారం జరిపారనే ఆరోపణలతో ఓన్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్‌ గోలియా, ఆయన వద్ద స్టెనోగా పనిచేసే అన్షుల్‌ సోని, మరో ఉద్యోగి రాహుల్‌ కటారియా.. తమ కుమారుడికి మత్తు మందు ఇచ్చి నెలరోజులుగా లైంగికవేధింపునకు గురిచేస్తున్నారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అఘాయుయిత్యాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించాని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించారు. కాగా బాధిత బాలుడిని చంపుతామని ఎసీబీ సర్కిల్‌ అధికారి పరమేశ్వర్‌ లాల్‌ యాదవ్‌, నిందితులు సోని, కటారియా బెదిరించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)