ఉత్తరప్రదేశ్లోని ఝలావర్ జిల్లా జేవార్లోని ఓ దళిత మహిళ గడ్డి కోసం పోలానికి ఒంటరిగా వెళ్లింది. ఆ పరిసరాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరూ లేని సమయం చూసి మహిళపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో తుపాకితో బెదిరించి ఆమెపై ఆ నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బీఎస్పీ, కాంగ్రెస్తో సహా విపక్షాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఘటనను ఖండిస్తూ.. గౌతమ్ బుద్ధ నగర్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేయడం చాలా విచారకరం, సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామని " ఆమె హిందీలో ట్వీట్ చేశారు.
తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి
October 12, 2021
0