భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొత్త సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసార, విద్యాశాఖల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవలే రిటైరైన ఖరే రాబోయే రెండేళ్లు కాంట్రాక్టు పద్దతిపై ప్రధానికి సలహాదారుగా ఉంటారు. ఈ నియామకానికి కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ప్రధాని సలహాదారుగా అమిత్ ఖేర్ కేంద్ర సెక్రటరీ ర్యాంకులో కొనసాగుతారు. ప్రధాని కార్యాలయంలో సలహాదారులు ఒకొక్కరుగా తప్పుకుంటున్న క్రమంలో కొత్తగా అమిత్ ఖరే రాకకు ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం సలహాదారులుగా పీకే సిన్హా, అమర్జీత్ సిన్హా ఈ ఏడాది తప్పుకోవడం, ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ కూడా వెళ్లిపోవడం తెలిసిందే.
ప్రధాని సలహాదారుగా అమిత్ ఖరే
October 12, 2021
0