'మేం విడిపోతున్నాం'

Telugu Lo Computer
0


తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 'చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యా భర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం''అని నాగ చైతన్య ట్వీట్‌చేశారు. 'ఈ సంక్షోభ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు అండగా నిలవాలని కోరుతున్నాం. మేం మా జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి''అని ఆయన అన్నారు. సమంత సైతం ఇదే తరహా పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. సమంత, చైతన్య విడిపోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని వీరిద్దరూ ఖండించకపోవడంతో, ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి తన పేరులో ''అక్కినేని'' ఇంటిపేరును సమంత తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు మొదలయ్యాయి. అక్టోబరు 6, 2017న గోవాలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)