స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0






దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు మూడు నెలలుగా భారీ హెచ్చుతగ్గులేమీ లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు వారం రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం కూడా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.269 పెరిగి రూ.45,766కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,497 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడటమే దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.వెండి ధరలు కూడా ఇవాళ బాగానే పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.630 పెరిగి రూ.59,704కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.59,074 వద్ద ముగిసింది. ఇదిలావుంటే అమెరికన్ డాలర్‌తో పొల్చితే రూపాయి మారకం విలువ ఇవాళ 32 పైసలు బలహీనపడి 74.63 రూపాయలకు దిగజారింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 1,759 అమెరికన్ డాలర్‌లు, ఔన్స్ వెండి ధర 22.58 అమెరికన్ డాలర్‌లు పలికింది.

Post a Comment

0Comments

Post a Comment (0)