హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం నామినేషన్ పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరపున బీజేపీ నేతలు నామినేషన్ వేశారు. పార్టీ ఆదేశాల మేరకు జమున నామినేషన్ను తాము దాఖలు వేసినట్టు వారు తెలిపారు. జమున తరపున ఒక సెట్ నామినేషన్ వేసినట్టు వెల్లడించారు. తన నామినేషన్తో పాటు తమ ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలకు సంబంధించిన అఫిడవిట్ను ఈటల జమున సమర్పించారు. దీని ప్రకారం ఆమె పేరు మీద ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 43,47,05,894. ఇందులో చరాస్థులు విలువ రూ.28,68,21,894, స్థిరాస్తుల విలువ రూ. 14,78,84,000. ఈటల జమునకు రూ. 4,89,77,978 అప్పులు ఉన్నాయి.