యాదాద్రి క్షేత్రంలో భక్తుల సందడి

Telugu Lo Computer
0

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనార్ధం క్యూలైన్లలో బారులు తీరారు. సేవా మండపాలు, ఉభయ దర్శన క్యూలైన్లు రద్దీగా మారాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.6.80లక్షల ఆదాయం వచ్చిందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో పట్టణంలో, ఘాట్‌రోడ్లు, రింగురోడ్డు వద్ద వాహనాల రద్దీ నెలకొంది. దీంతో కొండకింద వైకుంఠద్వారం నుంచి రింగురోడ్డు గుండా భక్తుల వాహనాలను పోలీసులు మళ్లించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)