పరిమళించిన మానవత్వం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడాన్నిగమనించిన కానిస్టేబుల్‌ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్‌ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ కానిస్టేబుల్‌ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్‌ సిబ్బంది అతన్ని అభినందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)