ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దారుణంగా మృతి చెందారు. గుమ్మగట్ట మండలం 75 వీరాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు మహిళలు దుర్మరణం
October 26, 2021
0