తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వరి విత్తనాల అమ్మకంపై తాను చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో ఆ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్యాలను ప్రచారం చేశారని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. నిన్న జరిగిన అగ్రికల్చర్ మీటింగ్లో తాను మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని డీలర్లను కోరామని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పామని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.