మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

Telugu Lo Computer
0


మావోయిస్ట్ అగ్రనేత ఆర్‌కే కన్నుమూశారు. ఆర్‌కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అలియాస్‌ సాకేత్ దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే తుదిశ్వాస విడిచారని చెబుతున్నారు. అయితే, ఆర్‌కే చనిపోయిన విషయాన్ని మావోయిస్ట్ నేతలు దృవీకరించలేదు. ఆర్కేపై ఇప్పటికే రూ. కోటి రివార్డు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో శాంతి చర్చలకు నేతృత్వం వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)