వరదనీటిలో చిక్కుకుని నవ వధువు మృతి

Telugu Lo Computer
0


తిరుపతి నగరంలో వరదనీటిలో చిక్కుకుని నవ వధువు మృతి చెందింది. శుక్రవారం రాత్రి తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని వెస్ట్ చర్చి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం నీట మునిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన సంధ్య అనే నవ వధువు మృతి చెందింది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతి తుఫాను వాహనంలో వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో తూర్పు చర్చి కూడలి వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిలో వారి వాహనం నీట మునిగింది. ఊపిరాడకపోవడంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురిని పోలీసులు కాపాడారు. వారిలో రెండేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)