మద్యం మత్తులో మహిళను వేధించిన టెకీ

Telugu Lo Computer
0




హర్యానాకు చెందిన మనేసర్‌లో ఇంజనీర్‌గా పనిచేసే వ్యక్తి తాగిన మైకంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురుగావ్ లో   వెలుగుచూసింది. యూపీకి చెందిన మహిళ గురుగావ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. మహిళ తాను అద్దెకు ఉన్న ఇంటి ఎదుట మరో ఇద్దరు కొలీగ్స్‌తో కూర్చుని ఉండగా నిందితుడు వారి వద్దకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మహిళ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినా నిందితుడు అదేపనిగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)