వరుడు కావలెను మూవీ ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన పలు వివాహ వేడుకలకి ఆ సినిమా నటీనటులు హాజరయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీని ప్రమోషన్ చేసే పనిలో పడింది చిత్ర బృందం. హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ. ఇలా సెలబ్రిటీలు తమ వివాహ వేడుకకి రావడంతో వధూవరులతో పాటు ఫంక్షన్కి వచ్చిన అతిథులు సైతం ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అంతేకాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ నటీనటులు. వీటికి సంబంధించిన ఈ పిక్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
వివాహ వేడుకల్లో 'వరుడు కావలెను' నటులు
October 25, 2021
0
Tags