వివాహ వేడుకల్లో 'వరుడు కావలెను' నటులు

Telugu Lo Computer
0


వరుడు కావలెను మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన పలు వివాహ వేడుకలకి ఆ సినిమా నటీనటులు హాజరయ్యారు. ఈ సినిమా అక్టోబర్‌ 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీని ప్రమోషన్‌ చేసే పనిలో పడింది చిత్ర బృందం. హీరో హీరోయిన్లు నాగశౌర్య, రీతూ వర్మ. ఇలా సెల​బ్రిటీలు తమ వివాహ వేడుకకి రావడంతో వధూవరులతో పాటు ఫంక్షన్‌కి వచ్చిన అతిథులు సైతం ఎంతో సర్‌ప్రైజ్‌గా ఫీల్‌ అయ్యారు. అంతేకాకుండా వారితో కలిసి ఫోటోలు దిగారు ఈ నటీనటులు. వీటికి సంబంధించిన ఈ పిక్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో  దర్శకురాలిగా పరిచయమవుతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)