కాశ్మీర్ లో తనిఖీలు ముమ్మరం

Telugu Lo Computer
0


జమ్మూ- కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను పొట్టన పెట్టుకున్నవిషయం తెలిసిందే. కొందరినే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌లో దాదాపు 70 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాయి. కశ్మీర్‌వ్యాప్తంగా మొత్తం 570 మందిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు స్థానిక పోలీసులు సైతం.. రాళ్ల దాడులకు పాల్పడినవారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)