దేశాధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన బాక్సర్‌

Telugu Lo Computer
0

 

పిలిప్పీన్స్‌కు చెందిన లెజెండరీ బాక్సర్ మ్యానీ పకియావో ఇవాళ ఆ దేశ అధ్యక్ష పోటీ కోసం అధికారికంగా నామినేషన్ వేశారు. వచ్చే ఏడాది మేలో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం పకియావో ఓ ట్వీట్ వీడియోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ బాక్సర్‌గా నా సమయం అయిపోయిందని చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ఇవాళ నేను నా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని పకియావో ఆ వీడియోలో చెప్పాడు. కొన్ని వారాల కిందట తన చివరి ప్రొఫెషనల్ ఫైట్‌లో క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్‌తో తలపడి ఓడిపోయాడు. 2010లోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. ప్రస్తుతం సెనేటర్‌గా ఉన్నాడు. తన పేదరికాన్ని పారదోలిన బాక్సింగ్‌కు గుడ్‌బై చెప్పడం చాలా బాధగా ఉన్నదని రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా పకియావో అన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)