ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం కరెన్సీ నోట్లతో మెరిసిపోయింది. రూ.5.16కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని పాలకవర్గం అలంకరించింది. రూ.500, 200, 100, 50, 20, 10 రూపాయల కొత్త నోట్లతో పాటు 7కిలోల బంగారం, 60 కిలోల వెండితో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.