ఈక్విటీ ద్వారా రూ. 4,500 కోట్లు...

Telugu Lo Computer
0

 



ప్రెష్‌ ఈక్విటీ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించాలని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం అదాని విల్మర్ యోచిస్తోంది. భారత్ లో టాప్ సెల్లింగ్ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ 'ఫార్చ్యూన్'... అదానీ ఎంటర్‌ప్రైజ్, విల్మర్ ఇంటర్నేషనల్‌ల జాయింట్ వెంచర్ ఇది. ప్రస్తుత, వినియోగదారుల మధ్య మార్కెట్‌ విజిబిలిటీ, అవేర్‌నెస్‌ పెంచడం ద్వారా కార్యకలాపాలను మరింత వృద్ధి చేసేందుకు అదాని విల్మర్... ఐపీవోకు రాబోతోంది. మరో ఐదేళ్ళలో... అంటే... 2027 నాటికి భారతదేశంలో అతి పెద్ద ఫుడ్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ... వేగంగా అభివృద్ధి చెందుతోన్న కన్స్యూమర్ సెగ్మెంట్‌లో మరింత బలపడాలని, ఐపీఓ ద్వారా ఆ విలువను అన్‌లాక్ చేయాలని యత్నిస్తోంది. ఈ ప్రణాళికలు ఫలించినపక్షంలో... ఇది అదానీ గ్రూపు నుంచి లిస్టయిన ఏడో సంస్థ అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)