బస్సు లోయలోపడి 28 మంది దుర్మరణం

Telugu Lo Computer
0



నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందారు.  ప్రమాదంలో గాయపడిన వారిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. నేపాల్‌లో పండుగ సీజన్ మొదలైంది. దీంతో అనేక మంది పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన డజను మందికి చికిత్సను అందించారు. ప్రమాదం సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో ఎవరికీ తెలియదు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశంవుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)