కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో పలు కంపెనీలు దేశీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ నుంచి లగ్జరీ బ్రాండ్స్ వరకూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే సంవత్సరాల్లో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులు, దిగ్గజ కంపెనీలు ఎంట్రీ ఇస్తాయని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.
టాటా టియాగో ఈవీ (రూ.6.5 లక్షలు)
టాటా అల్ర్టోజ్ ఈవీ (రూ 10.5-రూ12.5 లక్షలు)
మహీంద్రా ఈకేయూవీ100 (రూ 8.25 లక్షలు)
మహీంద్రా ఈకేయూవీ300 (రూ 12.5 లక్షలు)