మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లా కేంద్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్ ధర రూ.110ని దాటేసింది. మరోవైపు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్లోనూ లీటరు పెట్రోల్ రూ. 119.23గా ఉంటే.. రాజధాని భోపాల్లో రూ.116.62కు పెరిగింది. ఇవాళ పెట్రోల్పై 36పైసలు పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ.120 మార్కును దాటినట్లు అధికారులు చెబుతున్నారు. డీజిల్పై 37 పైసలు పెరగడంతో రూ.109.17కి చేరింది.
పెట్రోల్ రూ.120 దాటేసింది...!
October 27, 2021
0