ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వాహనంలో 16 మంది ఉన్నట్లు పేర్కొంటున్నారు. డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా ప్రాంతంలో బుల్హాద్-బైలా రోడ్డు గుండా వికాస్నగర్ వెళ్తున్న క్రమంలో యుటిలిటీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో మృతదేహాలన్నీ చెల్లచెదురుగా పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్థులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఈ ఘటన ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వాహనం లోయలో పడి 11 మంది దుర్మరణం
October 31, 2021
0